Gadwal Politics: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకోవడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వడ్డేపల్లి శ్రీను నాయకత్వంలో ఈ కౌన్సిలర్లు తమ మద్దతుదారులతో కలిసి హైదరాబాద్కు తరలివచ్చారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను.. ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే.. మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ చేరికతో వడ్డేపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ పూర్తి పట్టు సాధించడమే కాకుండా.. జిల్లాలో ఆ పార్టీ బలం గణనీయంగా పెరగనుంది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న నేతలు.. ఆయన సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వడ్డేపల్లి శ్రీను ఆధ్వర్యంలో తరలిన ఈ బృందానికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అధికార పార్టీలో చేరడం ద్వారా తమ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయవచ్చని కౌన్సిలర్లు భావిస్తున్నారు.
మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు ఉన్న నేతలు కాంగ్రెస్లోకి రావడంతో గద్వాల జిల్లాలో ప్రతిపక్షాల బలం మరింత క్షీణించే అవకాశం ఉంది. ఈ పరిణామం రానున్న రోజుల్లో స్థానిక సంస్థల బలోపేతానికి తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు ఒకేసారి పార్టీ మారడం అనేది జిల్లా రాజకీయాల్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా నిలిచింది.
Also Read: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ.. కాంగ్రెస్కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!
కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ
కాంగ్రెస్ గూటికి వడ్డేపల్లిలో గెలిచిన AIFB కౌన్సిలర్లు
సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్స్
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న కౌన్సిలర్లు
వడ్డేపల్లి మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు కైవసం… pic.twitter.com/KdMNd2HD4g
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2026