E-Paper
Advertisement

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు
Advertisement

Gadwal Politics: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకోవడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వడ్డేపల్లి శ్రీను నాయకత్వంలో ఈ కౌన్సిలర్లు తమ మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు తరలివచ్చారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను.. ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే.. మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ చేరికతో వడ్డేపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ పూర్తి పట్టు సాధించడమే కాకుండా.. జిల్లాలో ఆ పార్టీ బలం గణనీయంగా పెరగనుంది.

Advertisement

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న నేతలు.. ఆయన సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వడ్డేపల్లి శ్రీను ఆధ్వర్యంలో తరలిన ఈ బృందానికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అధికార పార్టీలో చేరడం ద్వారా తమ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయవచ్చని కౌన్సిలర్లు భావిస్తున్నారు.

మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు ఉన్న నేతలు కాంగ్రెస్‌లోకి రావడంతో గద్వాల జిల్లాలో ప్రతిపక్షాల బలం మరింత క్షీణించే అవకాశం ఉంది. ఈ పరిణామం రానున్న రోజుల్లో స్థానిక సంస్థల బలోపేతానికి తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు ఒకేసారి పార్టీ మారడం అనేది జిల్లా రాజకీయాల్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్‌గా నిలిచింది.

Advertisement

Also Read: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ.. కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×