E-Paper
Advertisement

Munugode by Poll : చౌటుప్పల్, చండూరు.. బీజేపీ ఆశలు ఫసక్..

Munugode by Poll : చౌటుప్పల్, చండూరు.. బీజేపీ ఆశలు ఫసక్..
Advertisement

Munugode by Poll : మునుగోడుపై భారీ ఆశలు పెట్టుకుంది బీజేపీ. RRR కి తోడుగా మరో R ని అసెంబ్లీకి పంపించాలని ఆశ పడింది. కానీ, కమలనాథుల ఆశలు గల్లంతయ్యాయి. బలమైన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కారు స్పీడు ముందు నిలవలేకపోయారు. రెండు రౌండ్లు మినహా.. మిగతా 13 రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ ఓటమి పాలయ్యారు.

బీజేపీ ఆశలన్నీ చౌటుప్పల్, చండూరు మండలాలపైనే. కమలనాథులు ఆశించినట్టుగానే చౌటుప్పల్ లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించగలిగారు. రెండు, మూడు రౌండ్లలో చౌటుప్పల్ నుంచే ఆ పార్టీకి ఆధిక్యం వచ్చింది. అయితే, ఆ మండలంలో భారీ మెజార్టీ వస్తుందని ఆశిస్తే.. సుమారు 700 ఓట్లకు మాత్రమే పరిమితమైంది ఆధిపత్యం. ఇక ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు బీజేపీ. రౌండ్ రౌండ్ లోనూ కారు హవా కొనసాగింది. టాప్ గేర్ లో దూసుకుపోయింది.

Advertisement

ఇక చండూరు మండల ఓట్ల లెక్కింపు వచ్చేసరికి మళ్లీ బీజేపీలో ఆశలు చిగురించాయి. కనీసం ఆ మండలంలోనైనా కాస్త ఓదార్పు దక్కుతుందుకుంటే అక్కడా నిరాశే మిగిలింది. పోలింగ్ నాడు సమయం మించిపోయాక కూడా చండూరు పోలింగ్ కేంద్రాల ముందు భారీగా ఓటర్లు క్యూ లో ఉన్నారు. అర్థరాత్రి వరకూ సాగింది అక్కడ పోలింగ్. ఆ ఓటింగ్ అంతా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనని.. అందులో మెజార్టీ శాతం బీజేపీకే పడతాయని భావించారు. యువ ఓటర్లు ఎక్కువగా కనిపిండంతో పువ్వు వికసిస్తుందని అంచనా వేశారు. కానీ, చండూరు మండల ఓట్ల కౌంటింగ్ లోనూ కారు పార్టీ పట్టు కొనసాగింది. దీంతో చండూరుకు చెందిన 11వ రౌండ్ ఫలితాలు రాగానే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం బోసి పోయింది.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×