E-Paper
Advertisement

BJP: జీతాలు పెంచాలి.. కొత్త పీఆర్సీకి బండి సంజయ్ డిమాండ్..

BJP: జీతాలు పెంచాలి.. కొత్త పీఆర్సీకి బండి సంజయ్ డిమాండ్..

BJP: ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడమే కష్టమై పోతోంది సర్కారుకు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జీతాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకటో తేదీన జీతం వస్తుందనే అంచనాతో ఇప్పటికే EMI లు పెట్టుకున్న జాబ్ హెల్డర్స్ జీతాలు ఆలస్యం అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక, ధనిక రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దివాళా తీయించారని.. జీతాలు కూడా టైమ్ కి ఇవ్వలేని దుస్థితికి దిగజార్చారంటూ సమయం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు రాజకీయ దాడి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరింత పెంచాలంటూ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వేతన సవరణ సంఘం (PRC) ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జులై ఒకటి నుంచి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించకుండా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని బండి సంజయ్ లేఖలో మండిపడ్డారు.
సీఆర్‌ బిస్వాల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్‌సీ నివేదికను 2018 జులై ఒకటి నుంచి అమలు చేయాల్సినప్పటికీ.. 21 నెలలుగా అమలు చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త ‘పే రివిజన్ కమిషన్‌’ (PRC)ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, ఉద్యోగుల తరఫున బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×