E-Paper
Advertisement

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!
Advertisement

Pilot Rohit Reddy: హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. గతంలో ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఉదంతంతో వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు చేసింది. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ పార్టీపై పక్కా సమాచారంతో ఈగిల్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం ఉత్కంఠకు దారితీసింది.

తుపాకీ తూటాల మోత.. ఈగిల్ టీమ్‌పై దాడి
సోదాల కోసం ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించిన ఈగిల్ టీమ్ సభ్యులను అక్కడ ఉన్న వ్యక్తులు అడ్డుకున్నారు. పోలీసులను చూసి భయాందోళన చెందడం కంటే, ఎదురుదాడికి దిగడమే కాకుండా రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలంలో కొకైన్‌తో పాటు కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్, బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) కూడా రంగంలోకి దిగి లోతైన తనిఖీలు చేపట్టింది.

Advertisement

ఏపీ ఎంపీ సహా ఎనిమిది మంది అరెస్ట్
ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారి వివరాలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా మొత్తం ఎనిమిది మంది వీఐపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఫామ్‌హౌస్ యజమాని, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పట్టుబడిన వారు డ్రగ్స్ సేవించారా లేదా అని నిర్ధారించుకోవడానికి నిర్వహించిన పరీక్షల్లో, ఎనిమిది మంది కొకైన్ తీసుకున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.

అధికార వర్గాల గోప్యత – రాజకీయ ప్రకంపనలు
ఈ కేసులో పట్టుబడిన వారు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు కావడంతో పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ప్రస్తుతం నిందితులందరినీ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌లో దొరికిన డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఒక సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఈ ఉదంతంలో చిక్కుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది.

Advertisement

Also Read: సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

మరోసారి వెలుగులోకి ఫామ్‌హౌస్ సంస్కృతి
గతంలో రాజకీయ వ్యూహాలకు అడ్డాగా నిలిచిన అదే ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్, తుపాకీ కాల్పుల వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. విలాసవంతమైన పార్టీల ముసుగులో జరుగుతున్న ఇటువంటి వ్యవహారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక త్వరలోనే విడుదల చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×