E-Paper
Advertisement

BSP Candidate Janaiah : సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థిపై దాడి.. నేడు బంద్

BSP Candidate Janaiah : సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థిపై దాడి.. నేడు బంద్

BSP Candidate Janaiah : సూర్యాపేట బీఎస్పీ అభ్యర్ధి జానయ్య యాదవ్‌పై బీఆర్ఎస్ నేతలు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు.ఈ ఘటనలో ఒక బీఎస్పీ కార్యకర్త గాయపడ్డారు. దాడి నుంచి జానయ్య యాదవ్ తృటిలో తప్పించుకున్నారు. ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో ఆదివారం రాత్రి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారానికి వెళ్ళారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకులు జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు . దీంతో జానయ్య తృటిలో తప్పించుకోగా ఆయన అనుచరుడుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాడి చేసిన జానయ్య యాదవ్ ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు.

తనపై హత్యాయత్నం జరిగిందని పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జానయ్య వాపోయారు. బీఎస్పీ కార్యకర్తల ధర్నాకు దిగడంతో ఎస్సై వచ్చి దాడి చేసిన వారు మత్తులో ఉన్నారంటూ తేలికగ్గాతీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని దగ్గరుండి మరీ ఇళ్లలో దిగబెట్టారని జానయ్య ఆరోపించారు. జానయ్యపై దాడి ఘటనకు నిరసనగా బీఎస్పీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×