E-Paper
Advertisement

BRS Loosing Municipalities : నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే.. ఖానాఫూర్ లో నెగ్గిన అవిశ్వాసం..

BRS Loosing Municipalities : నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే.. ఖానాఫూర్ లో నెగ్గిన అవిశ్వాసం..
BRS Loosing Municipalities

BRS Loosing Municipalities(Breaking news in telangana): నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌కు దక్కింది. 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో చైర్మన్ ఎన్నిక జరిగింది. బుర్రి శ్రీనివాస్ రెడ్డిని ఛైర్మన్‌గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గత నెల జనవరి 8న BRS మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయింది BRS. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభావం రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ పార్టీని వీడే నేతల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మున్సిపాలిటీలను ఒక్కొక్కటిగా కోల్పోతోంది. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఈ మున్సిపాలిటి కాంగ్రెస్‌ వశమైంది. పార్టీలకు అతీతంగా హస్తం పార్టీ అభ్యర్థికి కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 9 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో బీఆర్‌ఎస్‌ నుంచి మున్సిపాలిటీ చేజారి.. కాంగ్రెస్‌ ఖాతాలో పడింది.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×