Case Filed on BJP Leader Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాదవీలతపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే దానిపై కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది?
ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో బీజేపీ అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద నుంచి మసీవు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్లు చూపించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇమ్రాన్ అనే వ్యక్తి. ఆమె బాధ్యతారహిత చర్యకు పాల్పడ్డారని ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో ప్రస్తావించాడు. బీజేపీ అభ్యర్థిగా ఆమెని ప్రకటించిన నుంచి ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు బేగం బజార్ పోలీసులు తెలిపారు.
Also Read: Amitshah in Siddipet: ఇక బీజేపీ వంతు, వారానికి మూడు, సిద్ధిపేటకు 25న అమిత్ షా
మరోవైపు మసీదు వైపు బాణం వేస్తున్నట్లు మాధవీలత ఇచ్చిన స్టిల్స్ సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు కూడా. వెంటనే స్పందించిన మాధవీలత తన వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.