E-Paper
Advertisement

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. పలువురికి గాయాలు

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. పలువురికి గాయాలు
Advertisement

Charminar Express: నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. స్టేషన్ లో రైలు పట్టాలు తప్పడంతో.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పట్టాలు తప్పిన రైలు ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీ కొన్నట్లు అధికారులు తెలిపారు. మూడు బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంలో మరికొందరికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.

చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ రైలు నాంపల్లి స్టేషన్ లో ఆగేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. రైలు స్లోగా రన్ అవ్వడంతో పెనుప్రమాదమే తప్పిందని అధికారులు అంటున్నారు. మరోవైపు దక్షిణమధ్య రైల్వే చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై స్పందించింది. రైలు దాదాపు స్టేషన్ లోకి ఎంటరవ్వడంతోనే చాలా మంది ప్రయాణికులు దిగేశారని తెలిపింది. కొందరు ప్రయాణికులు గాయపడ్డారని, వారికి చికిత్స చేస్తున్నారని తెలిపారు. కాగా.. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు రైలును, పట్టాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

nampally railway station, charminar express accident

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×