BigTV English

KCR: అందుకే కరెంట్ డిపార్ట్‌మెంట్లో ఒక్క ఐఏఎస్‌ కూడా లేరు.. కేసీఆర్ చెప్పిన సీక్రెట్..

KCR: అందుకే కరెంట్ డిపార్ట్‌మెంట్లో ఒక్క ఐఏఎస్‌ కూడా లేరు.. కేసీఆర్ చెప్పిన సీక్రెట్..
kcr_electricity

KCR: సీఎం కేసీఆర్ ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పారు. గడిచిన పదేళ్లుగా కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఒక్కరంటే ఒక్క ఐఏఎస్‌ను కూడా నియమించలేదని చెప్పారు. అందుకో కారణం ఉందని సీక్రెట్ రివీల్ చేశారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో.. ఉచిత విద్యుత్ కోసం కరెంట్ శాఖ అధికారులందరినీ పిలిచి మీటింగ్ పెట్టానని చెప్పారు. రాష్ట్రమంతా నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం సాధ్యమా? కాదా? అని అడిగితే.. అధికారులు 5 రోజులు టైమ్ అడిగారని అన్నారు. వాళ్లు బాగా ఆలోచించుకుని వచ్చి.. మీరు తలుచుకుంటే సాధ్యమేనని చెప్పారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాకపోతే వాళ్లు తన దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని ట్రాన్స్‌ఫార్మర్లు అన్నిటినీ రేషనలైజ్ చేయాలని.. ఎమర్జెన్సీ సమయంలో అప్పటికప్పుడు బయటి నుంచి పవర్ కొనేందుకు.. ఎలాంటి అనుమతులు లేకుండా వెంటనే వాడుకునే అవకాశం ఉండేలా 25 కోట్ల నిధులు అందుబాటులో ఉంచాలని అన్నారని.. అందుకు తాను సరేనన్నానని చెప్పారు సీఎం.


ఇక, విద్యుత్ శాఖలో ఏదైనా ఫైల్ పుటప్ చేస్తే.. మంత్రితో మాట్లాడాలి, సీఎంతో మాట్లాడాలి అంటూ ఐఏఎస్ అధికారులు ఆలస్యం చేస్తుంటారని.. అదే టెక్నికల్ అధికారులు ఉంటే ఆ ప్రాబ్లమ్ లేకుండా వెంటనే పని అయిపోతుందనే విషయం తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. అందుకే, గడిచిన పదేళ్లలో విద్యుత్ శాఖలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌ను కూడా నియమించలేదని చెప్పారు సీఎం కేసీఆర్.

Related News

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Big Stories

×