BigTV English

KCR: జై భారత్.. కొత్త యుద్ధానికి శంఖం పూరించామన్న కేసీఆర్‌

KCR: జై భారత్.. కొత్త యుద్ధానికి శంఖం పూరించామన్న కేసీఆర్‌

KCR: తెలంగాణ సాధించిన పురోగతి దేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాల్లో రావాలని.. అందుకోసం మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించామని సీఎం కేసీఆర్ అన్నారు. జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగామో.. జై భారత్‌ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం అంకితం అవుదామని పిలుపు ఇచ్చారు.


వివక్షకు గురవుతున్న తెలంగాణను చూసి.. ఈ సమాజానికి మేలు జరగాలని జై తెలంగాణ నినాదంతో యుద్ధాన్ని ప్రారంభించి.. చివరికి విజయం సాధించామని.. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు చూస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణలో తలసరి ఆదాయం లక్ష ఉండేదని.. ఇవాళ 2.75లక్షలకు చేరిందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి.. గిఫ్ట్ లు పంచారు. తెలంగాణ మాదిరిగా భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి.. ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మారే దిశగా మనకు విజయం చేకూరాలని క్రిస్మస్‌ సందర్భంలో భగవంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు సీఎం కేసీఆర్.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×