E-Paper
Advertisement

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..
cm kcr

CM KCR: పోరు తెలంగాణ.. పోడు తెలంగాణగా మారింది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 1.51 లక్షల రైతులకు.. 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాల పంపిణీ షురూ చేశారు సీఎం కేసీఆర్. పోడు పట్టాలు అన్నింటినీ మహిళల పేరుమీదే అందించడం మరో ప్రత్యేకత.

కుమురంభీం జిల్లాలో.. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గంలోని ఆదివాసీలకు పోడు పట్టాలు స్వయంగా పంపిణీ చేశారు కేసీఆర్. పట్టాలతో పాటు రైతుబంధు చెక్కులను కూడా వేదికపైనే అందజేశారు.

పోడు భూములకు పట్టాలు ఇచ్చినందున.. గతంలో అడవులను ఆక్రమించారని గిరిజనులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్‌ కరెంట్ సరఫరా చేస్తామని చెప్పారు. ‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×