BigTV English

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..
cm kcr

CM KCR: పోరు తెలంగాణ.. పోడు తెలంగాణగా మారింది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 1.51 లక్షల రైతులకు.. 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాల పంపిణీ షురూ చేశారు సీఎం కేసీఆర్. పోడు పట్టాలు అన్నింటినీ మహిళల పేరుమీదే అందించడం మరో ప్రత్యేకత.


కుమురంభీం జిల్లాలో.. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గంలోని ఆదివాసీలకు పోడు పట్టాలు స్వయంగా పంపిణీ చేశారు కేసీఆర్. పట్టాలతో పాటు రైతుబంధు చెక్కులను కూడా వేదికపైనే అందజేశారు.

పోడు భూములకు పట్టాలు ఇచ్చినందున.. గతంలో అడవులను ఆక్రమించారని గిరిజనులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్‌ కరెంట్ సరఫరా చేస్తామని చెప్పారు. ‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×