BigTV English
Advertisement

Khammam: బస్సు-బుస్సు.. ఆర్టీసీ కేసీఆర్ తాతదా? పొంగులేటి ఫైర్.. రేవంత్ రయ్..

Khammam: బస్సు-బుస్సు.. ఆర్టీసీ కేసీఆర్ తాతదా? పొంగులేటి ఫైర్.. రేవంత్ రయ్..
khammam congress sabha

Khammam: ఖమ్మం వేదికగా కాంగ్రెస్ తలపెట్టిన తెలంగాణ గర్జనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాది మందితో సభ నిర్వహణకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఖమ్మంలో నిర్వహించబోయే రాహుల్ గాంధీ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులొచ్చినా సభ సక్సెస్ అవుతుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.


ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం చేరారు. ఖమ్మం డీసీసీ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ గర్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడంపై రేవంత్ రెడ్డి సైతం ఫైర్ అయ్యారు. బస్సులు, వాహనాలను అడ్డుకున్నా.. కాలినడకనైనా.. తొక్కుకుంటూ జనగర్జన సభకు రావాలంటూ రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. ఈ సభతో బీఆర్ఎస్ పార్టీకి సమాధి కడతామని అన్నారు.

సుమారు వందెకరాల సువిశాల ప్రాంగణంలో పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు ఖమ్మం బాట పడుతున్నారు.


రాహుల్ సభను విజయవంతం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని మాజీ మంత్రి పొంగులేటి ఆరోపించారు. ప్రైవేట్ వాహనాలు సభకు రాకుండా జిల్లా నలుమూలలా చెక్ పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ముందుగా బస్సులను ఇస్తామన్న ఆర్టీసీ యాజమాన్యం.. అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వెనక్కి తగ్గిందని పొంగులేటి ఆరోపించారు. ఆర్టీసీ ఏమైనా కేసీఆర్ తాత జాగీరా అని మండిపడ్డారు. తమ సొంత, వ్యక్తిగత వాహనాల్లో తెలంగాణ గర్జనకు తరలిరావాలని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ప్రజలను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. బహిరంగ సభకు మంచినీళ్ల సరఫరానూ కట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

మరోవైపు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులు రోడ్డెక్కారు. సభ కోసం వెళ్లే తమకు బస్సులు ఇవ్వాలంటూ డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. సత్తుపల్లి డిపో ఎదుట పిడమర్తి రవి, మణుగూరు డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాహుల్ సభకు ప్రజలను తరలించకుండా.. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్రలు పన్నుతున్నారని నేతలు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభను విజయవంతం చేసి తీరుతామని తేల్చిచెప్పారు కాంగ్రెస్ వాదులు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×