E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour : UPSC ఛైర్మన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పరీక్షల నిర్వహణపై చర్చ..

CM Revanth Reddy Delhi Tour : UPSC ఛైర్మన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పరీక్షల నిర్వహణపై చర్చ..

CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సీఎంతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా.. ఇంటెలిజెన్స్‌ చీఫ్ శివధర్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు కూడా ఢిల్లీ వెళ్లారు. వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన సాయం, నిధుల విడుదలపై విజ్ఞప్తి చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

UPSC ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనితో భేటీ అయింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్. UPSC పనితీరు పరిశీలిస్తున్నారు. పరీక్షల నిర్వహణపై చర్చిస్తున్నారు.ఇప్పటికే కేరళలో పర్యటించి అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరును IASల బృందం అధ్యయనం చేసింది.

ఇక గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరితో భేటీ అయ్యారు సీఎం రేవంత్‌. అలానే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ తో రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×