E-Paper
Advertisement

Hyderabad Rains Today: వర్షం కారణంగా ఉప్పొంగిన ముసీ నది.. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మూసివేత

Hyderabad Rains Today: వర్షం కారణంగా ఉప్పొంగిన ముసీ నది.. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మూసివేత
Advertisement

Hyderabad Rains Today: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి పొడవునా పడిన వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయ గేట్లు తెరవక తప్పలేదు. ఫలితంగా ముసీ నది ఉప్పొంగి, నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ముంపు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఉప్పల్, మూసా నగర్, శంకర్ నగర్, ఎంజిబిఎస్ రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చాదర్‌ఘాట్ వంతెన వద్ద ముసీ ప్రవాహం పెరగడంతో వంతెన సమీప రహదారులు ప్రమాదకరంగా మారాయి.

ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యగా చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ దగ్గర రోడ్లను పూర్తిగా మూసీవేశారు. దీంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా అల్లకల్లోలమైంది. వందలాది వాహనాలు ఇరుక్కుపోయాయి. ఉద్యోగాలకు, స్కూళ్లకు వెళ్ళే వారికి ఇబ్బందులు తలెత్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

ఇక ముసి నది ఒడ్డున ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. అక్కడి ఇళ్లలోకి నీరు చొచ్చుకుపోవడంతో ప్రజలు ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. రెస్క్యూ టీములు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు నిరంతరం మైక్‌ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, నది ఒడ్డునకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.

Read Also: VC Sajjanar: హైదరాబాద్ సీపీగా సజ్జనార్.. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లు బ‌దలీ..

Advertisement

నగరంలోని అనేక అండర్‌పాస్‌లు కూడా నీటితో నిండిపోయి రవాణా అంతరాయం కలిగించాయి. వర్షం కారణంగా ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న హైదరాబాద్, ఇప్పుడు ముసి వరదతో మరింత సమస్యల్లో పడింది. అధికారులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని సూచించారు.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని చెబుతోంది. అందువల్ల హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి జలాశయాల గేట్లు మళ్లీ తెరచే అవకాశం ఉంది. ముసీ నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ భారీ వర్షాల కారణంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ, జలాశయాల్లో నీరు నిండడంతో రైతులకు మాత్రం కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే నగర ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం చాదర్‌ఘాట్ వంతెన వద్ద పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ముసీ నీటి మట్టం తగ్గే వరకు రహదారులను మూసివేసే అవకాశముంది.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×