E-Paper
Advertisement

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్
Advertisement

Congress : 

⦿ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఫోకస్
⦿ వేగవంతం చేసేలా ప్రణాళికలు
⦿ ఉమ్మడి జిల్లాల వారీగా 9 మంది ఐఏఎస్‌ల నియామకం
⦿ తక్షణమే పర్యటనలు చేసి పరిశీలించాలని ఆదేశాలు
⦿ జిల్లాల వారీగా రోజు వారీ రిపోర్టులు
⦿ ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ : రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అలాగే, రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. జిల్లాల వారీగా రోజు వారీ రిపోర్ట్ అందించాలన్నారు సీఎం.

ప్రత్యేక అధికారులు వీరే

Advertisement

⦿ ఆదిలాబాద్, నిర్మల్​, అసిఫాబాద్​, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య
⦿ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల – ఆర్​వీ కర్ణన్​
⦿ నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనితా రామచంద్రన్
⦿ నిజామాబాద్, కామారెడ్డి – ఏ శరత్
⦿ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి- డీ దివ్య
⦿ మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌ కర్నూల్ – రవి
⦿ వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – వినయ కృష్ణా రెడ్డి
⦿ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట- హరిచందన దాసరి
⦿ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం – కె సురేంద్ర మోహన్

ALSO READ : రిజర్వేషన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ నేతలు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×