E-Paper
Advertisement

Sitaram Yechury: ఆయన పోరాట స్ఫూర్తితో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతాం : సీఎం రేవంత్

Sitaram Yechury: ఆయన పోరాట స్ఫూర్తితో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతాం : సీఎం రేవంత్
Advertisement

CPI (M) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఈనెల 12 ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆయన సంస్మరణ సభ నిర్వహించగా.. సీఎం రేవంత్ రెడ్డి హాజరై.. ఏచూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏచూరి రాసిన Caste and Class పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే అర్పించారని కొనియాడారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండుసార్లు ఆయన్ను కలిసి మాట్లాడానని, ఆయన మాటలు జైపాల్ రెడ్డిని గుర్తుచేశాయని సీఎం తెలిపారు. సీతారాం ఏచూరి జైపాల్ రెడ్డి సమకాలీకుడు అని చెప్పారు.

సామాన్యుడికి విద్యను అందించాలన్నా, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు చేరేలా యూపీఏ ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకురావడంలో సీతారాం ఏచూరి క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అలాంటి వ్యక్తి.. బీజేపీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు, సవరణలపై తన అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా వ్యక్తం చేశారన్నారు. జమిలీ ఎన్నికల ముసుగులో బీజేపీ తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడంలో, ప్రభుత్వం విధానాలను ప్రశ్నించడంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటన్నారు. దేశంలో ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలన్నారు.

Advertisement

Also Read: కూల్చివేతలు.. ఈసారి కోకాపేట్, భారీ బందోబస్తు మధ్య

జాతీయ రాజకీయాల్లో తెలుగువారు నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ శక్తుల్ని నిర్మూలించడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేసే విధంగా ఏచూరి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక భూమిక పోషించారని కొనియాడారు. ఆయనలాంటి వ్యక్తులు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరన్నారు. ఏది ఏమైనా వారు సూచించిన, పాటించిన విధానాలను ఫాలో అవుతామన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని సూచించారు.

Advertisement

రాహుల్ గాంధీ సీతారాం ఏచూరిని మార్గనిర్దేశకుడిగా భావిస్తారన్నారు. కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై వాడిన పదజాలాన్ని ప్రధాని మోదీ ఖండించకపోవడం.. బీజేపీ విధానాలేంటో చూపిస్తున్నాయన్నారు. వీధి రౌడీ అలాంటి మాటలు మాట్లాడటం వేరు అని, కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం వేరని సీఎం తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని అంత తేలికగా వదలబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×