E-Paper
Advertisement

India AI Impact Summit: ఏఐ శకం మొదలు.. హైదరాబాద్ అనువైన ప్రదేశం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్

India AI Impact Summit: ఏఐ శకం మొదలు.. హైదరాబాద్ అనువైన ప్రదేశం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్

India AI Impact Summit: ప్రపంచవ్యాప్తంగా ఏఐ శకం ఇప్పటికే మొదలైందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాప్ట్‌వేర్ విప్లవం నడుస్తోందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

ఏఐ శకం మొదలైందన్న సీఎం రేవంత్ రెడ్డి

మనిషికి ఎన్నో పరిమితులు ఉండవచ్చన్నారు సీఎం. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఏఐ ఫలితాలు మనం చూస్తున్నామని అన్నారు. మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందన్నారు. ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయన్నారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయన్నారు.

ప్రపంచంలోని టెక్ కంపెనీల దిగ్గజాలు ఈ సదస్సుకు వచ్చాయన్నారు. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడుతారని, ఐఏ రంగంలతో భారత్ గ్లోబ్ లీడర్ గా ఎదగాలన్నారు. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని మనసులోని మాటను బయటపెట్టారు. ఏఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమన్నారు. ఇప్పటికే ఏఐ యూనివర్సిటీని సకల వసతులతో ఏర్పాటు చేశామన్నారు.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ఇండియా అంది పుచ్చుకోవాలన్నారు ముఖ్యమంత్రి. అంతేకాదు ఏఐలో స్టార్టప్‌లను భారత్ ప్రొత్సహించాలన్నారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఏఐ సదస్సులు జరగాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు.

అదే సమయంలో ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను ఈ సందర్భంగా కోరారు. సమావేశం తర్వాత టెక్ పారిశ్రామిక‌వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ALSO READ: సిద్దిపేట యువతకు గేమ్ చేంజర్.. హరీష్ అన్న ఉద్యోగ యాప్ ను ప్రారంభించిన హరీష్ రావు!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×