E-Paper
Advertisement

CM Revanth reddy: తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy: తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy comments on Modi(TS politics): ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర బహిరంగ సభలో  సీఎం ప్రసంగించారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

గతంలో సోనియా గాంధీ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితిలో బీజేపీ ఉందని అన్నారు. రాజకీయాల కోసం రాముడిని కూడా వదిలిపెట్టడం లేదని ఫైర్ అయ్యారు.

Also Read:కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ

నరేంద్ర మోదీ తెలంగాణను అవమానించినప్పుడు బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో తెలంగాణను ఆక్రమించుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించినట్లే.. ఫైనల్స్ లో మోదీని ఓడించాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×