E-Paper
Advertisement

Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్‌పై కంప్లైంట్.. సైబర్ క్రైంకు కరాటే కల్యాణి..

Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్‌పై కంప్లైంట్.. సైబర్ క్రైంకు కరాటే కల్యాణి..
Advertisement

Devi Sri Prasad : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. సూపర్ హిట్ సంగీత దర్శకుడు. మంచి బీట్ ఉన్న మ్యూజిక్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. వందలాది సినిమాలతో వేలాది హిట్ సాంగ్స్ అందించారు. అప్పుడప్పుడు ఆయనపై కాపీ కాట్ ఆరోపణలు వచ్చినా.. బ్లాక్ బస్టర్లతోనే సమాధానం చెప్పారు. లేటెస్ట్ గా దేవీశ్రీ ప్రసాద్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది.

హిందూ మనోభావాలు దెబ్బతీశారంటూ దేవీశ్రీపై సైబర్ క్రైమ్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. చేసింది ఎవరనుకున్నారు.. కరాటే కల్యాణి. ఆమెతో పాటు పలు హిందూ సంఘాలు కూడా ఉన్నాయి.

Advertisement

హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ‘ఓ పారి’ ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌ గా మార్చేశారని.. అందుకుగాను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలనేది ఆ ఫిర్యాదు సారాంశం. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, అశ్లీల డ్యాన్సులతో ఆల్బమ్ క్రియేట్ చేసి.. హిందు మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ సాంగ్ లో వినిపించే మంత్రాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

‘ఓ పారి’ ఆల్బమ్ ను తెలుగులో ‘ఓ పిల్లా’ పేరుతో తీసుకొచ్చారు. పలు భాషల్లో రిలీజ్ చేశారు. గత నెలలోనే ఈ ఆల్బమ్ విడుదల చేయగా.. అప్పట్లోనే ఈ పాట బాగా వివాదాస్పదమైంది. పలువురు తప్పుబట్టారు. తాజాగా, కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఈ మధ్య పలు వివాదాల్లో కరాటే కల్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది అలవాటుగా మారిందో.. లేక, వివాదం చేయాలనో.. కారణం ఏదైనా కరాటే కల్యాణి దేవిశ్రీ ప్రసాద్ పై ఫిర్యాదు చేయడం ఆసక్తికరం.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×