BigTV English

Bandi Sanjay : రఘునందన్‌ కామెంట్స్ ఎఫెక్ట్.. బండి సంజయ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..

Bandi Sanjay : రఘునందన్‌ కామెంట్స్  ఎఫెక్ట్.. బండి సంజయ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..

Bandi Sanjay news today(Political news in telangana) : కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంద కోట్లు యాడ్స్ ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణల ఆధారంగా విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కరీంనగర్ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోహన్ సింగ్ కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు.


సోమవారం ఢిల్లీలో బండి సంజయ్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పుస్తెలు అమ్మిన బండి సంజయ్ కు ఇప్పుడు వంద కోట్ల యాడ్స్ ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని సీఆర్పీసీ 161 కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే బండి సంజయ్ పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×