E-Paper
Advertisement

Tummala latest news: తుమ్మల కోసం కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ!?.. హరీశ్ బుజ్జగింపులు!?

Tummala latest news: తుమ్మల కోసం కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ!?.. హరీశ్ బుజ్జగింపులు!?
Advertisement
Tummala nageswara rao news

Tummala nageswara rao news(Telangana news live):

తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ ఖమ్మం రాజకీయాలు తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మలను గులాబీ బాస్ దూరం పెట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో తుమ్మల పేరు లేదు. పాలేరు నుంచి మళ్లీ కందాల ఉపేందర్‌కే టికెట్ కేటాయించారు. దీనిపై తుమ్మల వర్గీయులు భగ్గుమంటున్నారు.

పార్టీ ఏదైనా పాలేరులో తుమ్మల పోటీ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో తన సన్నిహితులతో భేటీ అయ్యారు. అటు, జిల్లాలో ఆయన అనుచరవర్గమంతా ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారు. తుమ్మల పోటీలో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.

Advertisement

మరోవైపు తుమ్మలను బుజ్జగించేందుకు హరీష్‌రావు రంగంలోకి దిగినట్టు సమాచారం. తుమ్మలను పార్లమెంటుకు పోటీ చేయించేలా కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఎంపీ సీటు సాధ్యం కాకపోతే.. ఈసారి పక్కాగా ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి కూడా కట్టబెడతామంటూ హరీశ్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.

అటు తుమ్మల ఆప్తులు.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో మంతనాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సైతం తుమ్మలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అవసరమైతే బీజేపీ రాష్ట్ర స్థాయిలో పదవిని కట్టబెట్టి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించేలా బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ స్వయంగా తుమ్మలతో టచ్‌లోకి వెళ్లారని అంటున్నారు. పొంగులేటి మిస్ అయినా.. తుమ్మలనైనా బీజేపీలో చేర్చుకోవాలని ఈటల గట్టి ప్రయత్నమే చేస్తున్నారని టాక్.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×