E-Paper
Advertisement

Hyderabad News: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ నేతల రియాక్షన్స్, విచారణలో అన్నీ తెలుస్తాయి

Hyderabad News: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ నేతల రియాక్షన్స్, విచారణలో అన్నీ తెలుస్తాయి
Advertisement

Hyderabad News: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై అధికార పార్టీ నేతలు స్పందించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొలుత రియాక్ట్ అయ్యారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే మాకు గౌరవం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది నేరం అని అన్నారు. దీనిపై పారదర్శకంగా విచారణ జరిగి అన్నివిషయాలు బయటకు వస్తాయన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు

Advertisement

తనతోపాటు చాలామంది వాంగ్మూలం ఇచ్చామన్నారు. అందులో భాగంగానే కేటీఆర్, హరీష్‌రావులకు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ వ్యవహారం జరిగినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి తెలియకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయరని అనుకుంటున్నానని తెలిపారు.

అన్నీ సిట్ విచారణలో తేలుతాయన్ననారు. ఫోన్ ట్యాపింగ్‌లో వాస్తవాలు బయటికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మాకు ఎవరిపై రాజకీయ కక్ష లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము 75 శాతం నుండి 90 శాతం గెలుస్తామన్నారు. టికెట్ల పంపిణీలో ఇంచార్జి మంత్రి, డీసీసీ ఆధ్వర్యంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Advertisement

కాంగ్రెస్ నేతల రియాక్షన్స్, విచారణలో అన్నీ తెలుస్తాయి

ఆనాడు ప్రతిపక్ష నేతలు, పారిశ్రామికవేత్తలు, నటీనటుల ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై సిట్ వేసి విచారణ చేస్తున్నారని తెలిపారు. దాదాపు 500 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సమాచారం ఉందన్నారు. జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ పిలిచి విచారిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి, కొందరు మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు అంత సాహసం చేసే అవకాశం ఉందన్నారు. ఆనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే దాని ప్రకారం అధికారులు చేశారని తాము అనుకుంటున్నామని తెలిపారు. అంతవరకు ఎవర్నీ దోషులని భావించలేమన్నారు. రెండేన్నరేళ్ల తర్వాత రాజకీయ కక్ష అనేది ఎక్కడుంటుందన్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ మల్లు రవి రియాక్ట్ అయ్యారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. చట్టం ముందు అందరు సమానమే, ఎవరూ ఎక్కువ కాదన్నారు.

ALSO READ: యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం.. అసలు దొంగలు వారేనా?

 

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×