E-Paper
Advertisement

Marri Shashidharreddy : మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. లీగల్ నోటీసులు జారీ..

Marri Shashidharreddy : మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. లీగల్ నోటీసులు జారీ..
Advertisement

Marri Shashidharreddy : బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కి కాంగ్రెస్ షాకిచ్చింది. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతకు ముందు కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి 6 సంవత్సరాలపాటు సస్పెండ్ చేసింది.

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందన్నారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని విమర్శించారు. మాణిక్కం ఠాకూర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్కం ఠాకూ ర్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నోటీసులు తీసుకునేందుకు రెడీగా ఉండాలన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు మధురై కోర్టు వైపు పరుగులు పెట్టిస్తానని శశిధర్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ చేసిన ఆరోపణలపై మాణిక్కం ఠాకూర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులపై బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×