BigTV English

Marri Shashidharreddy : మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. లీగల్ నోటీసులు జారీ..

Marri Shashidharreddy : మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. లీగల్ నోటీసులు జారీ..

Marri Shashidharreddy : బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కి కాంగ్రెస్ షాకిచ్చింది. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతకు ముందు కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి 6 సంవత్సరాలపాటు సస్పెండ్ చేసింది.


కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందన్నారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని విమర్శించారు. మాణిక్కం ఠాకూర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్కం ఠాకూ ర్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నోటీసులు తీసుకునేందుకు రెడీగా ఉండాలన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు మధురై కోర్టు వైపు పరుగులు పెట్టిస్తానని శశిధర్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ చేసిన ఆరోపణలపై మాణిక్కం ఠాకూర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులపై బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×