E-Paper
Advertisement

Kavitha Missing: కవిత కనబడుటలేదు.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు

Kavitha Missing: కవిత కనబడుటలేదు.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు
Advertisement

అయితే.. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు కవిత. అయినా.. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా సొమ్ముతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు.. కానీ.. ప్రజా సమస్యలను మాత్రం గాలికొదిలేస్తున్నారు.. అంటూ కవితపై భగ్గుమంటున్నారు.

Advertisement

నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఎన్నికైన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కానీ వ్యక్తిగత కేసులో గత ఐదు నెలల నుంచి తీహార్ జైలులో ఉన్న కవిత ఇటీవల బెయిల్‌తో బయటకి వచ్చారు. సుమారు నెలన్నర  పైగా నిజామాద్‌కు వెళ్లలేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ కవిత వారి సాధక భాధకాలు కూడా వినాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నిజామాబాద్ వెళ్లక పోవడంతో కొంత మంది కాంగ్రెస్ నాయికులు, తెలంగాణా ఉద్యమకారులు ఆదే ప్రవీణ్ కుమార్, కోనేటి సాయికుమార్, ఈర్ల శేఖర్ శనివారం వన్ టైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు ‘హైడ్రా’బాద్ ఉండునా ?

Advertisement

ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సౌకర్యాలు పొందుతున్న ఆమె మా బాధలను కూడా పట్టించుకోవాలని, ప్రజలకు సేవ చేయాల్సిన కనీస బాధ్యత ఆమె నిర్వహించకుండా ఖాళీగా ఉండటం కరెక్టు కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైనా కూడా ఆమె జిల్లాలో కనిపించడం లేదన్నారు. ఆమెను వెతికి జిల్లా ప్రజల ముందు ఉంచాలని కోరారు.

ఇక మధ్యం కుంభకోణం కేసులో నిందుతురాలుగా ఉన్నఎమ్మెల్సీ కవిత దాదాపు ఐదు నెలలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించి, ఇటీవల ఆగష్టు 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేసిన సంగతి తెలిసిందే.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×