E-Paper
Advertisement

Kavitha’s Custody Extended: కవితకు భారీ షాక్.. కస్టడీ పొడగింపు!

Kavitha’s Custody Extended: కవితకు భారీ షాక్.. కస్టడీ పొడగింపు!
Advertisement

Kavitha Judicial custody Extended to Till May 30: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఈ నెల 20 వరకు న్యాయస్థానం పొడిగించింది. తదుపరి విచారణను మే20 కు వాయిదా వేసింది.

అయితే, ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈడీ తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ న్యాయస్థానం.. కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ ను దాఖలు చేశామని ఈడీ పేర్కొన్నది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపిన కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అయితే, సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే.

Also Read: Priyanka’s daughter Miraya: ప్రియాంక కూతురు మిరయాపై ట్వీట్, కేసు నమోదు

Advertisement

అయితే, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్నారు. ఈ కేసు విషయమై కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ ను కూడా దాఖలు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 24న విచారణ చేపట్టనున్నది. అయితే, తనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×