E-Paper
Advertisement

Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంతంటే..?

Telangana :  ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంతంటే..?
Advertisement

TS Govt employees news(Latest news in Telangana): తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పంది. డీఏ, పింఛనుదారులకు డీఆర్‌ 2.73 శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఉత్తర్వులు ఇచ్చామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

Advertisement

2022 జనవరి నుంచి డీఏ పెంపు వర్తిస్తుంది. సర్కార్ నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్ల భారం పడుతుంది. అంటే ఏడాదికి రూ.974.16 కోట్ల భారం పడుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ.1,380.09 కోట్ల బకాయిలను చెల్లిస్తారు.

డీఏ పెంపుపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. టీఎన్జీవో, టీజీవో, పీఆర్‌టీయూటీఎస్‌, ట్రెసా, పెన్షనర్ల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×