E-Paper
Advertisement

Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంతంటే..?

Telangana :  ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంతంటే..?

TS Govt employees news(Latest news in Telangana): తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పంది. డీఏ, పింఛనుదారులకు డీఆర్‌ 2.73 శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఉత్తర్వులు ఇచ్చామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

2022 జనవరి నుంచి డీఏ పెంపు వర్తిస్తుంది. సర్కార్ నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్ల భారం పడుతుంది. అంటే ఏడాదికి రూ.974.16 కోట్ల భారం పడుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ.1,380.09 కోట్ల బకాయిలను చెల్లిస్తారు.

డీఏ పెంపుపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. టీఎన్జీవో, టీజీవో, పీఆర్‌టీయూటీఎస్‌, ట్రెసా, పెన్షనర్ల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×