BigTV English

Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ .. అప్పటి వరకు అదే ఆహారం..

Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ .. అప్పటి వరకు అదే ఆహారం..


Pawan Kalyan Varahi Tour(Andhra news today): జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి నవరాత్రుల దీక్ష చేపట్టారు. నేటి నుంచి దీక్ష ప్రారంభమైంది. దీక్ష సమయంలో జనసేనాని అన్నం తినరు. కేవలం పాలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.

ఎన్నికల పర్యటన కోసం ఇష్టదైవం వారాహి అమ్మవారి రూపంలోనే వాహనాన్ని స్పెషల్‌గా తయారు చేయించారు పవన్. ఆ రథ యాత్రకు వారాహి అమ్మవారి పేరే పెట్టారు. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష కార్తీక మాసాంతం వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత దీక్షను పవన్ కల్యాణ్ విరమిస్తారు.


రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్‌లో ఇటీవల యాగం నిర్వహించారు పవన్ కల్యాణ్. రెండు రోజులపాటు యాగం నిర్వహించిన తర్వాత అన్నవరం నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర కొనసాగుతోంది.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ జనసేనాని ముందుకుసాగుతున్నారు. బహిరంగం సభల్లో వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. సభలకు భారీగా జనం తరలివస్తున్నారు. దీంతో జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.

Tags

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×