BigTV English

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..

Diwali Bonus : ఏవైనా పండుగల సందర్భంలో పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు, ఇంక్రిమెంట్లు ఇస్తుంటుంది. ఇటీవల తమిళనాడులో ఒక యజమాని తన కంపెనీ ఉద్యోగులకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను దీపావళి గిఫ్టులుగా ఇచ్చారు. మరొకరు కార్లను గిఫ్టులుగా ఇచ్చారు. తాజాగా.. బొగ్గుగని కార్మికులకు కూడా దీపావళి బోనస్ ఇస్తున్నట్లు కోల్ ఇండియా యాజమాన్యం వెల్లడించింది.


ఒక్కో ఉద్యోగికి రూ.85 వేల చొప్పున ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్ ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున బోనస్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళికి రూ.76,500 బోనస్ చెల్లించగా.. ఈ ఏడాది రూ.1.20 లక్షలు బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టగా.. రూ.8500 పెంచి.. రూ.85000 చెల్లిస్తామని చెప్పింది. కాగా.. పీఎల్ఆర్ బోనస్ ను సింగరేణి కార్మికులకు దీపావళికి 7-10 రోజుల ముందు చెల్లిస్తుండగా.. ఇతర ప్రాంతాల వారికి దసరా ముందు చెల్లిస్తున్నారు.


Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×