BigTV English

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..

Diwali Bonus : ఏవైనా పండుగల సందర్భంలో పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు, ఇంక్రిమెంట్లు ఇస్తుంటుంది. ఇటీవల తమిళనాడులో ఒక యజమాని తన కంపెనీ ఉద్యోగులకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను దీపావళి గిఫ్టులుగా ఇచ్చారు. మరొకరు కార్లను గిఫ్టులుగా ఇచ్చారు. తాజాగా.. బొగ్గుగని కార్మికులకు కూడా దీపావళి బోనస్ ఇస్తున్నట్లు కోల్ ఇండియా యాజమాన్యం వెల్లడించింది.


ఒక్కో ఉద్యోగికి రూ.85 వేల చొప్పున ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్ ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున బోనస్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళికి రూ.76,500 బోనస్ చెల్లించగా.. ఈ ఏడాది రూ.1.20 లక్షలు బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టగా.. రూ.8500 పెంచి.. రూ.85000 చెల్లిస్తామని చెప్పింది. కాగా.. పీఎల్ఆర్ బోనస్ ను సింగరేణి కార్మికులకు దీపావళికి 7-10 రోజుల ముందు చెల్లిస్తుండగా.. ఇతర ప్రాంతాల వారికి దసరా ముందు చెల్లిస్తున్నారు.


Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×