
ED Raids on Kavitha Relatives (morning news today telugu): ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును వేగవంతం చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. వరుసగా ఎమ్మెల్సీ కవిత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఇప్పుడు వాళ్ల బంధువుల ఇళ్లపై దృష్టి పెట్టింది ఈడీ. ఇందులోభాగంగా ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం సోదాలు చేపట్టింది ఈడీ. కవిత అరెస్ట్ తర్వాత జరుగుతున్న సోదాలు ఇవేకావడంతో మరోసారి కలకలం రేగింది.
శనివారం ఉదయం ఆరున్నర గంటలకు మాదాపూర్ లోని డీఎస్ఆర్ హోమ్ కు చేరుకున్న ఈడీ అధికారులు. కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో రైడ్స్ నిర్వహించారు. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా కవిత ఈడీ కస్టడీ శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని కోర్టు వద్ద ప్రస్తావించి మరోసారి కవితను కస్టడీకి తీసుకోవాలని ఈడీ ప్లాన్ చేసినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.