![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/11/e387385ebe0dbeefed3e8e9f3968aaba.jpg)
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కరీంనగర్లోని 371 పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించింది. నాగార్జునసాగర్ 103వ పోలింగ్ బూత్లో EVM, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో, కాగజ్నగర్ 97వ పోలింగ్ బూత్లో, స్టేషన్ఘన్పూర్ 117వ పోలింగ్ బూత్లో, మంథని 85వ పోలింగ్ కేంద్రంలో, సిరిసిల్లలోని తంగళ్లపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి.
జగిత్యాల 32వ పోలింగ్ బూత్లో ,దుబ్బాక పోలింగ్ కేంద్రంలో, సిద్దిపేట భరత్నగర్ 118 బూత్లో, మెదక్ జిల్లా ఎల్లాపూర్ పోలింగ్ కేంద్రంలో, దామరచెరువు పోలింగ్ కేంద్రంలో, సంగారెడ్డి సెయింట్ జోసెఫ్ స్కూల్ లో, జుక్కల్ పోలింగ్ కేంద్రంలో, రామాయంపేటలో , దుబ్బాక 43వ పోలింగ్ బూత్లో, మెదక్ చిల్వర్ ప్రభుత్వ స్కూల్లో, కామారెడ్డి 253 పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించడంతో.. క్యూలైన్లలో ఉన్న ఓటర్లు పడిగాపులు పడుతున్నారు.