E-Paper
Advertisement

Fake news on Revanth Reddy: ఫేక్ వార్తలు నమ్మొద్దు.. సీఎం పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు: ప్రభుత్వం స్పష్టం

Fake news on Revanth Reddy: ఫేక్ వార్తలు నమ్మొద్దు.. సీఎం పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు: ప్రభుత్వం స్పష్టం
Advertisement

Fake news on Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి.. సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఉన్నారన్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో కావాలనే.. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ప్రభుత్వ వర్గాల ప్రకారం రేవంత్ రెడ్డి ఎటువంటి అనారోగ్య సమస్యతోనూ బాధపడటం లేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ప్రతిరోజూ ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ సాధారణ షెడ్యూల్ ప్రకారమే సీఎం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

Advertisement

అయితే ఇటీవల ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా వేదికలలో కొందరు కావాలనే ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి.. అసత్య వార్తలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సీఎం అనారోగ్యానికి గురయ్యారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెబుతూ ఫేక్ పోస్టులు వైరల్ చేశారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవడం లేదని, ఆయన ఎక్కడా ఆసుపత్రిలో చేరలేదని అధికారులు స్పష్టంగా తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాల వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement

ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఈ విధమైన ఫేక్ న్యూస్‌ను సృష్టిస్తున్నాయని తెలిపారు.

ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని హెచ్చరించింది. ఫేస్‌బుక్‌లో దురుద్దేశపూర్వకంగా ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సైబర్ క్రైం విభాగం ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిందని, ఫేక్ పోస్టులు చేసిన ఖాతాల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

Also Read: మంత్రులతో సీఎం కీలక భేటీ.. చర్చించే అంశాలివే..

ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం ఒక విజ్ఞప్తి కూడా చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మవద్దని, ముఖ్యంగా అధికారిక నిర్ధారణ లేని ఆరోపణలను షేర్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేయడం కూడా నేరమేనని గుర్తుచేసింది.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×