E-Paper
Advertisement

అన్నదాత ఆగ్రహం.. రోడ్డెక్కిన పూడూర్ రైతులు!

అన్నదాత ఆగ్రహం.. రోడ్డెక్కిన పూడూర్ రైతులు!
Advertisement

Farmers Protest: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో అనేక రోజులుగా ఎదురుచూస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో పెడుతున్న నిబంధనలు తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని మండిపడుతూ.. పూడూర్ వద్ద కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.

ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు కూడా మద్దతు పలికారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఈ ధర్నాలో రైతులతో కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వానాకాలం పంట చేతికొచ్చి వారాలు గడుస్తున్నా, ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోవడం దారుణమని విమర్శించారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా, తక్షణమే ప్రతి గింజను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

రైతుల రాస్తారోకోతో కరీంనగర్ – జగిత్యాల మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డప్పటికీ, అన్నదాతల గోడు వినేవారే లేరని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు, అధికారులు రంగ ప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Also Read: శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు దుర్మరణం!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×