E-Paper
Advertisement

Tamilisai: ప్రజాస్వామ్యాన్ని .. హక్కులను కాపాడుకుందాం: తమిళిసై

Tamilisai: ప్రజాస్వామ్యాన్ని .. హక్కులను కాపాడుకుందాం: తమిళిసై
Advertisement

Tamilisai: రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈకార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తమిళిసై తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువకులు కలిగిన దేశం భారత్ అని వెల్లడించారు. యువకులు సవాళ్లను ఎదుర్కోవాలని.. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని సూచించారు. విద్య, పరిశోధన అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు.

Advertisement

తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారులు, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ గౌరవాన్ని.. ప్రజాస్వామ్యాన్ని .. హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కొందరికి తాను నచ్చకపోయినా.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం.. పథకాల అమలు కోసం.. ప్రభుత్వాన్ని గైడ్ చేయడం తన బాధ్యతని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదని.. అభివృద్ధి అంటే జాతి నిర్మాణం అని అన్నారు. ఫామ్‌హౌజ్ కట్టడం అభివృద్ధి కాదని… పేదల ఆకాంక్షలు నెరవేరాలని తమిళిసై వెల్లడించారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×