E-Paper
Advertisement

Harishrao: ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం.. రాత్రి 12 అయినా కదలం: హరీశ్‌రావు

Harishrao: ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం.. రాత్రి 12 అయినా కదలం: హరీశ్‌రావు
Advertisement

Harishrao Comments: సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైబరాబాద్ సీఫీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఇక్కడి నుంచి కదలబోనంటూ పేర్కొంటున్నారు. అయితే, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఇష్యూపై ఫిర్యాదు చేసేందుకు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీపీ ఆఫీసుకు వచ్చారు. అనంతరం సీపీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘దాడి ఘటనపై జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం. రాత్రి 12 అయినా కదలం. గాంధీ, అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. తక్షణం అరెస్ట్ చేయాలి, విచారణ జరపాలి. అరెస్ట్ చేయకుంటే కోర్టుకువెళ్తాం. ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష జరపాలి. ఢిల్లీలో రాహుల్ ఇంటి ఎదుట ధర్నా చేస్తాం. సిద్ధిపేటలో నా ఆఫీసుపై కూడా దాడి చేశారు. ఖమ్మంలో మాజీ మంత్రుల కార్లపై కూడా దాడి చేశారు. నల్లగొండలో మా ఎమ్మెల్యేలపై దాడి చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడి చేసినవారికి మర్యాదలు చేస్తున్నారు.

Also Read: పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?

Advertisement

సైబరాబాద్ సీపీతో మూడుసార్లు ఫోన్ మాట్లాడా. యాక్షన్ తీసుకుంటానని సీపీ చెప్పారు. ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారం సీపీకి తెలియదా? సీఎం డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారు’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.

Also Read: సీపీ ఆపీస్ వద్ద హైటెన్షన్.. పోలీసులతోనూ కౌశిక్ రెడ్డి వాగ్వాదం

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×