E-Paper
Advertisement

Revanth Reaction: పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?

Revanth Reaction: పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?
Advertisement

CM Revanth Reddy Reaction: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, హుజూరాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదు. ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉండాలి. కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి ఢోకా లేదు. మా సంఖ్య బలం 65’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: సీపీ ఆపీస్ వద్ద హైటెన్షన్.. పోలీసులతోనూ కౌశిక్ రెడ్డి వాగ్వాదం

Advertisement

‘ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలు. బీఆర్ఎస్, బీజేపీ మా ప్రభుత్వాన్ని 3 నెలల్లో కూల్చేస్తామంటున్నాయి. చట్టం కఠినంగా ఉంటే మాకు ఆ పరిస్థితి రాదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును నేను స్టడీ చేయలేదు. అందువల్ల నేను దానిపై ఇప్పుడే ఏ కామెంట్ చేయలేను. బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కాంగ్రెస్ కంటే అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారు. మా వాటా నుంచి ఎంఐఎం, బీజేపీ, సీపీఐలకు అవకాశం కల్పించాం. 2018లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ పీఏసీ చైర్మన్ పదవిని ఎంఐఎంకు ఇచ్చారు. 2014లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీలోనూ టీడీపీ నుంచి నా పేరు, ఎర్రబెల్లి దయాకర్ పేరును ప్రతిపాదిస్తే తిరస్కరించారు.

Also Read: హుటాహుటిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వెళ్లిన హరీశ్‌రావు.. ఇదేం పద్ధతంటూ..

Advertisement

పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి మంచిదే. ఆ మాటలు కౌశిక్ రెడ్డి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ ముఖ్యులకు తెలిసే కౌశిక్ రెడ్డి అలా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అంటూ రేవంత్ అన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×