E-Paper
Advertisement

Rains : తెలుగు రాష్ట్రాల్లో ఆగని వర్షాలు.. ఇంకా ఎన్ని రోజులు కురుస్తాయంటే..?

Rains : తెలుగు రాష్ట్రాల్లో ఆగని వర్షాలు.. ఇంకా ఎన్ని రోజులు కురుస్తాయంటే..?
Advertisement

Rains : తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వాతావరణశాఖ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని తెలిపింది.

హైదరాబాద్‌లోనూ భారీ వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. వచ్చే రెండు మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

Advertisement

భారీ వర్షాల వల్ల మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని రుద్రవెల్లి వద్ద మూసీ ఉద్ధృతికి లో-లెవల్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో బీబీనగర్ -పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బీమా లింగం కత్వా వద్ద కూడా మూసీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోలేపల్లి – చౌటుప్పల్ మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

వరంగల్‌ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులను నిండా ముంచాయి. ఆరుకాలం శ్రమించిన.. కష్టమంతా.. నేలపాలైంది.

Advertisement

ఏపీలోనూ సోమ, మంగళవారాలు అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సోమవారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షం పడుతోంది. విజయవాడ, ఏలూరులో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలు జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మండువేసవిలో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×