E-Paper
Advertisement

Mallareddy: ఆ ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు.. మల్లారెడ్డి కేసులో హైకోర్టు స్టే..

Mallareddy: ఆ ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు.. మల్లారెడ్డి కేసులో హైకోర్టు స్టే..
Advertisement

Mallareddy: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పరస్పర కేసులతో ఉత్కంఠ కొనసాగుతోంది. తనపై మల్లారెడ్డి తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు తొలగించాలంటూ పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కేసునైతే తొలగించలేదు కానీ.. నాలుగు వారాల పాటు ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది. రత్నాకర్ పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది.

అసలేం జరిగిందంటే..
ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్ పై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదాయపన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. స్పందించిన పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్‌పై ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రత్నాకర్‌పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది.

Advertisement

మరోవైపు, మల్లారెడ్డిపై ఐటీ శాఖ సైతం పోలీసులకు పలు ఫిర్యాదులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడం.. దౌర్జన్యం చేయడం.. ఆధారాలు ధ్వంసం చేయడం.. తదితర ఆరోపణలతో పలు సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలా, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో.. ఐటీ దాడుల కేసులో అనేక ట్విస్టులకు దారి తీస్తోంది.

అటు, ల్యాప్ టాప్ వ్యవహారం సైతం మల్లారెడ్డి మెడకు చిక్కుకునేలా ఉంది. ఐటీ అధికారి రత్నకుమార్‌ తన ల్యాప్‌టాప్‌ చోరీ అయిందని, అందులో ఉన్న విలువైన డాటా తొలగించారని… మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆ ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ఐటీ అధికారులు మాత్రం ల్యాప్‌టాప్‌ తీసుకునేందుకు రాలేదు. ఆ ల్యాప్ టాప్ తనది కాదన్నారు రత్నాకర్. దీంతో, ల్యాప్‌టాప్‌ ను సీజ్ చేసి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసులు.

Advertisement

ఇలా మల్లారెడ్డి వర్సెస్ ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగుతోంది. పరస్పర కేసులతో ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×