E-Paper
Advertisement

Pawan Kalyan: ఎన్టీఆర్ లానే పవన్.. మిలట్రీ వ్యాన్ లా ప్రచార రథం..

Pawan Kalyan: ఎన్టీఆర్ లానే పవన్.. మిలట్రీ వ్యాన్ లా ప్రచార రథం..
Advertisement

Pawan Kalyan: ఎవరన్నారు పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని? ఎవరన్నారు కల్యాణ్ కి కమిట్ మెంట్ లేదని? ఎవరన్నారు జనసేనాని జనంలో ఉండరని? ఎవరన్నారు పాలిటిక్స్ పార్ట్ టైమని? వారందరి నోళ్లు మూయించేలా.. జనం కోసం.. జనంలోకి వస్తున్నారు పవన్ కల్యాణ్. బస్సు యాత్రతో ఏపీలో ప్రభంజనం సృష్టించేందుకు తరలివస్తున్నారు.

జనసేనాని బస్సుయాత్ర అంటే ఏర్పాట్లు మామూలుగా ఉంటాయా? పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్టు ఏ బెంజ్ బస్సులోనో యాత్ర చేస్తారనుకున్నారు కొందరు. అలా అయితే ఆయన జనసేనాని ఎందుకవుతారు. అత్యంత సాదాసీదాగా.. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా.. ప్రత్యేక బస్సు రెడీ చేయిస్తున్నారు.

Advertisement

అచ్చం.. అలనాటి అన్నగారి చైతన్యరథాన్ని పోలి ఉండేలా బస్సును తీర్చిదిద్దుతున్నారు. బస్సులోనే బస చేసేలా.. బస్సు మీదనుంచి ప్రసంగించేలా.. అన్ని వసతులతో డిజైన్ చేస్తున్నారు. ఎక్కడా హైటెక్ హంగులకు వెళ్లకుండా.. సింపుల్ గా బస్సును తయారు చేయిస్తున్నారు.

గతంలో పెద్ద ఎన్టీఆర్ చైతన్య రథంపై ఆంధ్ర దేశాన్ని సుడిగాలిలా చుట్టేసి.. పార్టీ పెట్టిన 8 నెలల్లోనే అధికారంలోకి రాగలిగారు. అన్నగారే స్పూర్తిగా.. చైతన్యరథాన్ని పోలి ఉండేలా.. పవన్ కల్యాణ్ సైతం అలాంటి భారీ వాహనాన్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వాహనానికి సైతం చైతన్యరథం మాదిరే మిలట్రీ గ్రీన్ కలర్ వేశారు. ఆ వెహికల్ కలర్ ని చూడగానే.. దేశభక్తి రగిలేలా.. రెడీ చేస్తున్నారు.

Advertisement

హైదరాబాద్ లోని ఓ గ్యారేజీలో పవన్ కోసం వేగంగా ముస్తాబవుతోంది ఆ బస్. మరి, తన ప్రచార రథానికి జనసేనాని ఏం పేరు పెడతారో..?

Related News

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

Big Stories

Advertisement
×