E-Paper
Advertisement

Khammam : ఖమ్మం ప్రమాదంపై భిన్నకోణాల్లో దర్యాప్తు.. బాధిత కుటుంబాలు ఆందోళన..

Khammam : ఖమ్మం ప్రమాదంపై భిన్నకోణాల్లో దర్యాప్తు.. బాధిత కుటుంబాలు ఆందోళన..
Advertisement

Khammam : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. అజ్మీర మంగు, బానోతు రమేష్ లు బుధవారం మధ్యాహ్నం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెరుగైన వైద్యం కోసం మరో నలుగురిని ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న సమయంలో లక్ష్మణ్ ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి చావు అంచుల వరకు వెళ్లాడు. అయితే వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి అతని ప్రాణాలు నిలిపి హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనలో మొత్తం 8 మందికి తీవ్రగాయాలు కాగా….ముగ్గురు చనిపోయారు. నలుగురికి కాళ్లను తొలగించారు.
అయితే వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం వల్ల కాళ్లు నుంచి గుండెకు పంపింగ్ చేసే నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు అంటున్నారు.

Advertisement

రాత్రి పొద్దు పోయేంత వరకు మృతదేహాలను గ్రామంలోకి అనుమతించకుండా గ్రామస్తులు అడ్డుపడ్డారు.
మృతుల కుటుంబసభ్యులకు వెంటనే ప్రభుత్వ సాయం అందించి బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు…. పక్కా ఇల్లు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మరోవైపు ఘటనపై పోలీసుల విచారణ సాగుతోంది. ఇది సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా లేదంటే….. మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×