E-Paper
Advertisement

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం.. పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం..  పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే
Advertisement

Hyderabad News: హిల్ట్‌ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని ప్రస్తావించారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం.

తెలంగాణలో రాజకీయాలు కొన్నిరోజులుగా హిల్ట్ పాలసీ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు ప్రజాశాంతి చీప్ కేఏ పాల్. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకో కీలక విషయాలు ప్రస్తావించారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం చేసిన 9,292 ఎకరాల భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం. పాల్‌తో పాటు మరో రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో ఉన్న భూములకు కంపెనీలు పెట్టడం లేదని, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు వివరించారు. ఆయా భూములు ఎవరికి అమ్మకుండా స్టే ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఇలాంటి విలువైన భూములు దుర్వినియోగం చేస్తే వాటిపై కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యాపారవేత్తలతో అగ్రిమెంట్లు చేసినా అవి నిలబడవని అన్నారు.

Advertisement

 

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×