E-Paper
Advertisement

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం.. పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం..  పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే

Hyderabad News: హిల్ట్‌ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని ప్రస్తావించారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం.

తెలంగాణలో రాజకీయాలు కొన్నిరోజులుగా హిల్ట్ పాలసీ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు ప్రజాశాంతి చీప్ కేఏ పాల్. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకో కీలక విషయాలు ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన 9,292 ఎకరాల భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం. పాల్‌తో పాటు మరో రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో ఉన్న భూములకు కంపెనీలు పెట్టడం లేదని, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు వివరించారు. ఆయా భూములు ఎవరికి అమ్మకుండా స్టే ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఇలాంటి విలువైన భూములు దుర్వినియోగం చేస్తే వాటిపై కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యాపారవేత్తలతో అగ్రిమెంట్లు చేసినా అవి నిలబడవని అన్నారు.

 

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×