E-Paper
Advertisement

Delhi: పాత ఫోన్లతో ఈడీ ఆఫీసుకు కవిత.. ఈ సారి ఏం జరుగునో..?

Delhi: పాత ఫోన్లతో ఈడీ ఆఫీసుకు కవిత.. ఈ సారి ఏం జరుగునో..?
Advertisement

Delhi: ముచ్చటగా మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. వరుసగా రెండోరోజు ఆమెను ప్రశ్నిస్తున్నారు. సోమవారం సుదీర్ఘంగా పదిన్నర గంటల పాటు కవిత ఎంక్వైరీ జరిగింది. మంగళవారం మళ్లీ రమ్మన్నారు ఈడీ అధికారులు. ఉదయం పదకొండున్నరకు ఈడీ ఆఫీసుకు వెళ్తూ.. తాను వాడిన 10 పాత ఫోన్లను తీసుకెళ్లారు కవిత. ఆ ఫోన్లను రెండు ప్లాస్టిక్ కవర్లలో ఉంచి.. మీడియాకు చూపించారు. ఈసారి కూడా కవిత వెంట భర్త అనిల్ ఈడీ ఆఫీసు వరకు వచ్చారు.

మరోవైపు, ఫోన్ల విషయంలో ఈడీ అధికారి జోగేంద్రకు లేఖ రాశారు కవిత. ఈడీ రాజకీయ కోణంలోనే విచారణ చేస్తోందని.. దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాను ఫోన్లు ధ్వంసం చేశానని గత నవంబర్‌ నుంచే ప్రచారం చేస్తున్నారని.. తనను విచారణకు పిలిచిందే ఈ ఏడాది మార్చిలో అని.. అలాంటప్పుడు ఫోన్ల విషయంలో ఆ దుష్ప్రచారం ఎందుకు చేశారని ప్రశ్నించారు. పాత ఫోన్లు ఇవ్వమంటూ కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని.. అయినా అడిగారు కాబట్టి తన 10 పాత ఫోన్లను తీసుకొచ్చానని అన్నారు. మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కాదా? అంటూ ఈడీని నిలదీశారు కవిత.

Advertisement

మంగళవారం నాటి ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం.. బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని, కవితను ఎదురెదురుగా ఉంచి సమగ్రంగా విచారించారు. మనీశ్ సిసోడియాతోనూ కలిపి విచారించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద కవితను ప్రశ్నించారు. మద్యం కేసులో మనీలాండరింగ్‌పై విచారణ జరిపారు. సోమవారం సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు వచ్చిన కవిత.. విక్టరీ సింబల్ చూపిస్తూ.. స్మైల్ ఇస్తూ కనిపించారు.

ఇప్పటికే రెండు దఫాలుగా కవితను సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఆమెను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకైతే అలాంటిదేమీ జరగలేదు. మంగళవారం మరోసారి విచారణకు హాజరుకావడంతో.. కవిత అరెస్ట్‌పై హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది.

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటినుంచీ సంచలనమే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది ఈడీ. ఇప్పుడు కవిత వంతు వచ్చింది. సౌత్‌ గ్రూప్‌లో కవితనే కీ పర్సన్ అని ఈడీ భావిస్తోంది. ఆప్ నేతలకు 100 కోట్లు ముడుపులు అందించారనేది ఈడీ ఆరోపణ.

Related News

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

రెండేళ్లు చాన్సివ్వండి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది..ప‌రీక్ష‌లో మంచి మార్కులు తెచ్చుకుంటా! ఆ త‌రువాత మీ జీత‌భ‌త్యాలు నేను చూసుకుంటా!

కృష్ణా నీటి వివాదంపై తేలని పంచాయితీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కేఆర్ఎంబీ!

కేటీఆర్ జెన్‌జీ మంత్ర.. విద్యార్థులు, నిరుద్యోగుల‌తో ఢిల్లీ బాట‌..! జెన్‌జీ మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య‌త్నం..

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

Big Stories

Advertisement
×