E-Paper
Advertisement

Kavitha: హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ

Kavitha: హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం ఐదుగురు సభ్యుల ఈడీ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అయిపోగానే కవిత ఈడీ ఆఫీస్ నుంచి ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు.

ఆ తర్వాత అర్థరాత్రి కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వచ్చారు. 12.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై ఈడీ విచారణ జరిగిన తీరును వివరించారు. ఈడీ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు అనే వివరాలను కేసీఆర్‌కు తెలిపారు.

మరోవైపు ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. తొలిసారి జరిగిన ఈడీ విచారణలో ప్రాథమిక అంశాల గురించే కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండోసారి జరగబోయే విచారణలో కవితను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.

Tags

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×