TET Notification: తెలంగాణ ప్రభుత్వ ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్నటువంటి ఇన్-సర్వీస్ టీచర్లకు రాష్ట్రంలో ప్రస్థుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులకు కొంత ఉపశమనం కలగనుంది. అందుకుగాను విద్యాశాఖ నేడు టెట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరీక్ష కేవలం సర్వీస్లో ఉన్న ఉపాద్యాయులకు మాత్రమే నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ నోటిఫికేషన్కు సంభదించిన పూర్తి వివారాలు ఇలా ఉన్నాయి. ఈ నెల జూలై 22 నుండి 29 వ తేదీ వరకు ఆన్లైన్లో ధరఖాస్తులను స్వీకరించనున్నారు. రానున్న సెప్టెంబర్ 7 తేది నుండి సెప్టెంబర్ 11 వరకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పద్దతిలో పరీక్షలను నిర్వహించనున్నారు.
Also read: Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?
ఉపాద్యాయులకు ఈ పరీక్షను మోత్వం రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల బోధనా స్థాయిలకు తగ్గట్టుగా ఈ పరీక్షను నిర్వహించనునన్నట్టు సమాచారం. అయితు మొదటి పేపర్లో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బోధించే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. రెండవ పేపరులో మొత్తం 6 వ తరగతి నుండి ఎనిమిదో తరగతికి భోదించే ప్రాథమిక, మరియు ఉన్నత పాఠశాల ఉపాద్యాయులకోసం నిర్వహించనున్నారు.
Also read: RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!