E-Paper
Advertisement

Kavita ED latest news : రాజకీయ కక్షతోనే నోటీసులా? కవిత విచారణకు వెళ్లేనా?

Kavita ED latest news : రాజకీయ కక్షతోనే నోటీసులా? కవిత విచారణకు వెళ్లేనా?
Advertisement
Kavita ED latest news

MLC Kavitha latest news(Political news today telangana) :

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మళ్లీ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. తనకు మోదీ నోటీసు వచ్చిందని సెటైర్ వేశారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఈ నోటీసు వచ్చిందని ఆరోపించారు. ఆ నోటీసును పార్టీ లీగల్‌ టీమ్‌కు పంపామన్నారు. లీగల్‌ టీమ్‌ సలహా ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.

ఢిల్లీ మద్యం కేసు విచారణ ఏడాది నుంచి కొనసాగుతూనే ఉందన్నారు కవిత. టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మరో ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తున్నారని విమర్శించారు. నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదన్నారు. గతంలో 2జీ కేసు విచారణ చాలా కాలం సాగిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని కోరింది. ఈ కేసులో దినేశ్‌ అరోరా, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవ నిందితులుగా ఉన్నారు. వారు ఇప్పటికే అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో మార్చి 16, 20, 21 తేదీల్లో ఢిల్లీలో కవిత విచారించింది ఈడీ. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మరి ఆమె విచారణకు హాజరవుతారా?

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×