E-Paper
Advertisement

ED Revealed Key Facts: కేసీఆర్‌కు వాళ్లను కవిత ముందే పరిచయం చేసింది: ఈడీ!

ED Revealed Key Facts: కేసీఆర్‌కు వాళ్లను కవిత ముందే పరిచయం చేసింది: ఈడీ!

ED Revealed KCR Know the about Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం విధానం కేసు విషమై ఈడీ తాజాగా పలు విషయాలను బయటపెట్టింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్న సందర్భంగా ఈడీ సంచలన విషయాలను కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి ముందుగానే కవిత, కేసీఆర్ కు చెప్పిందని ఈడీ పేర్కొన్నది. ఆ సమయంలో ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన బృందంలోని సభ్యులైనటువంటి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైను కవిత.. కేసీఆర్ కు పరిచయం చేసిందని ఈడీ తెలిపింది. అనంతరం వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని, కేసీఆర్ కు సమీర్ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేశారని ఈడీ వెల్లడించింది.

Also Read: సోనియాతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

‘అయితే, కేసీఆర్ తో భేటీ అయిన వివరాలకు సంబంధించి గోపీ కుమరన్ వాంగ్మూలంలో రికార్డు చేశారు. కవిత రెండేళ్లలో సుమారు 11 సెల్ ఫోన్లు వాడారు. అందులో నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×