Hyderabad: హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు ఎస్ఆర్ నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం-అసలు ఘటన ఎలా జరిగింది? జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రైనీ ఐపీఎస్, మోతీనగర్లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వెంటనే బంధువులు ఆయన్ని ఎస్ఆర్ నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స-ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఆయన ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టారు. తనపై వచ్చిన ఫిర్యాదు, ప్రచారాలు అవాస్తమని రాసుకొచ్చారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని రాసుకొచ్చారు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత రిపోర్టు చేయాలన్నారు.
ఓ పోస్ట్ పెట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్-మరోవైపు ట్రైనీ ఐపీఎస్ మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ట్రైనీ ఐపీఎస్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.
ALSO READ: రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించినట్లు ఈయనపై అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదు కాగా, జాతీయ పోలీస్… pic.twitter.com/XGNwiCX6RL
— BIG TV Breaking News (@bigtvtelugu) July 20, 2026