E-Paper
Advertisement

KCR: 15 ఏళ్ల నాటి కేసు.. కేసీఆర్, కేటీఆర్‌లకు భారీ ఊరట, నాంపల్లి కోర్టు కీలక తీర్పు

KCR: 15 ఏళ్ల నాటి కేసు.. కేసీఆర్, కేటీఆర్‌లకు భారీ ఊరట, నాంపల్లి కోర్టు కీలక తీర్పు
Advertisement

తెలంగాణ ఉద్యమ కాలం నాటి పాత కేసు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సహా కీలక నేతలకు ఊరట లభించింది. 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో సుమారు 15 ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో జేఏసీ పిలుపునిచ్చిన సకల జనుల సమ్మెలో కేసీఆర్, కేటీఆర్, పద్మారావు గౌడ్, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రైలు రోకోలు, రహదారుల దిగ్బంధం వంటి నిరసనలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులపై సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతూ కేసును కొట్టేసింది.

Advertisement

ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే పలుమార్లు నేతలు కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులుగా వారు వాదనలు వినిపించారు. తాజాగా వెలువడిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమకారులపై ఉన్న అక్రమ కేసులన్నీ వీగిపోతాయని నేతలు పేర్కొంటున్నారు.

ALSO READ: KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు బీఆర్ఎస్ సిద్ధం: కేటీఆర్

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×