E-Paper
Advertisement

KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు బీఆర్ఎస్ సిద్ధం: కేటీఆర్

KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు బీఆర్ఎస్ సిద్ధం: కేటీఆర్

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి పార్టీలో చేరుతున్న వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించిన అభ్యర్థులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో సాగు సమయానికి ముందే రైతుల ఖాతాల్లో ‘రైతు బంధు’ డబ్బులు జమ అయ్యేవని, కానీ నేడు రైతులు ఆ సాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘రైతు బంధు’ను నిలిపివేసి, కొత్తగా ‘రాహుల్ బంధు’ అనే పథకాన్ని అమలు చేస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి ఏడాదికి వెయ్యి కోట్లు రాహుల్ గాంధీకి పంపించి, తన పదవిని కాపాడుకోవడమే రేవంత్ లక్ష్యమని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమేనా అని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వికలాంగుల ఇళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు మరియు ఆయన సోదరుడి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కేటీఆర్ సెటైర్లు వేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు కావస్తున్నా అతీగతీ లేదని విమర్శించారు. ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం, రైతులకు పంట బోనస్, మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని చెబుతూనే, లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటని అడిగారు. 40 లక్షల మంది వృద్ధులు రూ. 4 వేల పెన్షన్ కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల పొట్ట కొడుతున్న ఈ ‘రాబందు’ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ పాలన కోసం వేచి చూస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజా పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Also: Telangana BJP: కంచుకోట కల.. కమలంలో గుబులు.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×