BigTV English

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Kcr Medigadda : బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి కోర్టుకు డుమ్మా కొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనిపై విచారణ చేయాలని కోరుతూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు వేశారు. దీనిపై గతంలో రెండు సార్లు భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్‌తో సహా పలువురికి సమన్లు జారీ చేసింది. కాగా, కేసీఆర్, స్మితా సభర్వాల్ మినహా సమన్లు అందుకున్న వారందరి తరపున వారి లాయర్లు గతంలో కోర్టుకు హజరయ్యారు. కానీ, మూడోసారి కూడా కేసీఆర్ ఈ సమన్లకు స్పందించలేదు.


నోటీసుల బేఖాతర్ – 
ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో పాటు 8 మందికి ఆగస్టు మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. అయితే, సెప్టెంబరు 5న మాజీ మంత్రి హరీశ్​రావు తరపున న్యాయవాదులు లలితా రెడ్డి, సుకన్య.. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ మేఘా కృష్ణారెడ్డి, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రజత్ కుమార్, ఎల్ అండ్ టీ ఎండీ సురేశ్​ కుమార్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవధాని, శ్రావణ్ రావు.. ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్లు హరిరామ్, శ్రీధర్ తరఫున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి హాజరయ్యారు. కానీ, మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మితా సబర్వాల్​ తరపున న్యాయవాదులెవ్వరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో అక్టోబరు 17కు కేసును వాయిదా వేస్తూ జిల్లా జడ్జి నారాయణబాబు ఉత్తర్వులిచ్చారు. కానీ, గురువారం కోర్టుకు మరోసారి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మితా సబర్వాల్ డుమ్మా కొట్టటం చర్చగా మారింది.

న్యాయపోరాటం ఆగదు: రాజలింగమూర్తి
చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని పిటిషినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ లింగమూర్తి మీడియాతో అన్నారు. భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పారు. ఇకనైనా బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా కేసీఆర్ కోర్టుకు వచ్చి, వాస్తవాలు వివరించాలని ఆయన కోరారు.


Related News

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Big Stories

×