![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/khammam-copy.jpg)
Khammam : ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది ఆ ఘటన. ఆ తండ్రి ధీనగాధ కన్నీరు పెట్టిస్తుంది. అంబులెన్సు సౌకర్యం లేక కుమార్తె మృతదేహన్ని 65 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లాడు ఆ తండ్రి. ఈ ఘటన ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఫ్రీ అంబులెన్స్ లేక పోవడం.. ప్రైవేట్ అంబులెన్స్కి డబ్బులు ఇచ్చే స్థోమత లేక పోవడంతో.. కూతురు డెడ్బాడీని తండ్రి డైక్పై తీసుకెళ్లాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారి సంచలనం సృష్టిస్తోంది.
చనిపోయిన తన కూతురిని 65 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లాడు. మూడేళ్ల కూతురు మృతదేహాన్ని పొత్తిళ్లలో పెట్టుకొని దు:ఖాన్ని దిగమింగుకుంటూ బైక్ పై ప్రయాణించారు ఆబిడ్డ తల్లిదండ్రులు. వాగు దాటుకుంటూ చివరకు ఇంటికి చేరుకున్నారు.
కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన వెట్టి సుక్కి అనే ఆదివాసి గిరిజన బాలిక రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉచిత అంబులెన్స్ కోసం సిబ్బందిని సంప్రదించాడు. అంబులెన్న్ సౌకర్యం లేదని చెప్పడంతో ప్రైవేట్ అంబులెన్స్, ఆటోలకు పెద్ద మొత్తంలో చెల్లించలేక చనిపోయిన కూతురి మృతదేహాన్ని బైక్ పైనే తీసుకొస్తున్నానని చెప్పాడు తండ్రి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.